శ్రీ బల భీమ న్యూస్ ప్రతినిధి – కొడంగల్

వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణంలోని కృష్ణవేణి పాఠశాలలో ముస్లింల పవిత్రమైన రంజాన్ పండుగ నేపత్యంలో విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. సోమవారం పాఠశాల లో ప్రిన్సిపాల్ మసూద్ అలీ సమక్షంలో విద్యార్థులు ఆనందంగా మరియు ఐక్యత సోదర భావంతో పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు . పండుగ యొక్క గొప్ప విలువలను విద్యార్థులకు తెలియజేయడం పాటు పండుగల సాంస్కృతి సాంప్రదాయాల ను వివరిస్తూ ఎంతో సంబరంగా పండుగ వేడుకలను నిర్వహించడం జరిగిందన్నారు . ఈ వేడుకలలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని ఎంతో సంబరంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు. విద్యార్థులకు కేవలం చదువొక్కటే కాకుండా క్రీడలు మానసిక ఉల్లాసంగా గడిపేందుకు పండుగ వాతావరణం తో పాటు సమాజంలో జరిగే పలు అంశాలను వివరించడం విశ్లేషించడం మా పాఠశాల ఉపాధ్యాయులకే దక్కుతుందని కొనియాడారు . ఈ వేడుకలలో పాఠశాల ఉపాధ్యాయులతో పాటు. విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు .





