హన్మకొండలోని కాళోజీ కళాక్షేత్రంలో ఈ రోజు (ఆదివారం) నిర్వహించిన ‘హమాలీ మహా గర్జన’ కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. మంత్రితో పాటు ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, టీజీఎస్ అధ్యక్షుడు కోదండరామ్, కార్మిక సంఘాల నాయకులు కూడా పాల్గొన్నారు.
వరంగల్, మార్చి 15: హమాలీల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు తెలంగాణ రాష్ట్రంలోని హమాలీలు.. ‘హమాలీ మహా గర్జన’ కార్యక్రమాన్ని నిర్వహించారు. హన్మకొండలోని కాళోజీ కళాక్షేత్రంలో ఈ రోజు (ఆదివారం) నిర్వహించిన ‘హమాలీ మహా గర్జన’ కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. మంత్రితో పాటు ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, టీజీఎస్ అధ్యక్షుడు కోదండరామ్, కార్మిక సంఘాల నాయకులు కూడా పాల్గొన్నారు. తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిస్కరించాలని మంత్రి సీతక్క ఎదుటే కార్మిక సంఘం నేత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.


