పొంగుతున్న వాగులు.. సొంత ఊర్లకు పోయేదేలా..!

  • బ్రిడ్జిలు నిర్మించిన ఫలితం శూన్యం
  •  ప్రజాధనం కాంట్రాక్టర్ల జేబులోకే..!
  • చిన్నపాటి వర్షానికే రాకపోకలు స్తంభింపు
  •  కొత్త బ్రిడ్జి నిర్మించాలని గ్రామస్తుల విజ్ఞప్తి

శ్రీ బల భీమ న్యూస్ / కొడంగల్, ఆగస్టు 4 (ప్రతినిధి):

వర్షాకాలం ప్రారంభమైతే చాలు… ఖాజా హైమత్‌పల్లి గ్రామ ప్రజలకు కష్టాల కాలం మొదలవుతోంది. చిన్నపాటి వర్షం కురిసినా గ్రామ శివారులో ఉన్న వాగు ఉప్పొంగి ప్రవహించడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోతున్నాయి. దీంతో ఖాజా హైమత్‌పల్లి, నాగారం, అన్నారం తదితర గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, అత్యవసర వైద్యం కోసం వెళ్లాల్సిన రోగులు గంటల తరబడి వాగు తగ్గే వరకు నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంటోంది.

గ్రామస్తుల కథనం ప్రకారం, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పాత బ్రిడ్జి పూర్తిగా శిథిలావస్థకు చేరుకుని కూలిపోవడంతో ప్రజల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఆ సమయంలో అప్పటి స్థానిక ఎమ్మెల్యే కొత్త బ్రిడ్జి నిర్మాణానికి సుమారు రూ.40 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు. అయితే, ఆ నిధులతో చేపట్టిన పనులు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా జరగలేదని గ్రామ ప్రజలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.

స్థానికంగా కొందరు నాయకులు కాంట్రాక్టు పనులు దక్కించుకుని, పనులను పైపైన మాత్రమే పూర్తి చేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై నాసిరకం నిర్మాణం చేపట్టడంతో నేడు చిన్నపాటి వర్షానికే బ్రిడ్జిపై వరదనీరు ప్రవహిస్తూ ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోందని వారు వాపోతున్నారు. ప్రజల రక్షణ, భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకోకుండా నిర్మించిన ఈ బ్రిడ్జి వల్ల ప్రభుత్వ నిధులు వృథా అయ్యాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రెండు గంటల వర్షానికే రాకపోకలు నిలిచిపోయాయి

సోమవారం సాయంత్రం దాదాపు రెండు గంటలపాటు కురిసిన వర్షంతో వాగు ఉప్పొంగి ప్రవహించింది. వరద నీరు బ్రిడ్జిపై నుంచి ప్రవహించడంతో గ్రామాలకు వెళ్లే మార్గం పూర్తిగా మూసుకుపోయింది. దీంతో వాగు ఇరువైపులా వందలాది మంది ప్రజలు చిక్కుకుపోయారు. మహిళలు, చిన్నారులు, వృద్ధులు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొంతమంది అత్యవసర పనుల నిమిత్తం గ్రామాలకు వెళ్లలేక గంటల తరబడి అక్కడే వేచి ఉండాల్సి వచ్చింది.

గ్రామస్తుల మాటల్లో చెప్పాలంటే, ప్రతి వర్షాకాలంలో ఇదే పరిస్థితి పునరావృతమవుతోందని, ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా శాశ్వత పరిష్కారం మాత్రం కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు మారినా, ప్రజాప్రతినిధులు మారినా, అధికారుల బదిలీలు జరిగినా గ్రామ ప్రజల సమస్య మాత్రం అలాగే కొనసాగుతోందని వారు అంటున్నారు.

సర్పంచ్ అనురాధ – రమేష్ చొరవతో జేసీబీ సహాయం

వాగు ఉప్పొంగి ప్రజలు అవతలివైపు చిక్కుకుపోయిన విషయం తెలుసుకున్న ఖాజా హైమత్‌పల్లి గ్రామ సర్పంచ్ అనురాధ – రమేష్ వెంటనే స్పందించారు. తమ సొంత ఖర్చుతో జేసీబీ యంత్రాన్ని అక్కడికి రప్పించి, యువకుల సహాయంతో వాగు అవతల చిక్కుకున్న ప్రజలను సురక్షితంగా తమ గ్రామాలకు చేరవేసేలా చర్యలు చేపట్టారు. ప్రమాదకర పరిస్థితుల్లో ప్రజలకు అండగా నిలిచిన సర్పంచ్ సేవలను గ్రామస్థులు అభినందించారు. సమయానికి స్పందించి సహాయం అందించినందుకు గ్రామ ప్రజలు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

👉 చిన్న వర్షం పడితే చాలు వాగు దాటడం కష్టం..
👉 తీవ్ర ఇబ్బందులకు అవుతున్న ఆయా గ్రామాల ప్రజలు
👉 గతంలో లక్షలు పెట్టి వెచ్చించిన బ్రిడ్జి శూన్యం..
👉 ప్రజాధనం కాంట్రాక్టర్ల జేబులోకి..!
👉 ఆవేదన వ్యక్తం చేస్తున్న గ్రామాల ప్రజలు

Sri Bala Bheema breking news

కొత్త బ్రిడ్జి నిర్మాణమే శాశ్వత పరిష్కారం

ప్రస్తుతం ఉన్న బ్రిడ్జి ఎత్తు తక్కువగా ఉండటంతో చిన్నపాటి వర్షానికే వరద నీరు దానిపై నుంచి ప్రవహిస్తోంది. దీంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అత్యవసర సేవలు కూడా గ్రామాలకు చేరుకోవడం కష్టసాధ్యమవుతోందని ప్రజలు పేర్కొంటున్నారు. పాత బ్రిడ్జికి బదులుగా ఆధునిక సాంకేతిక ప్రమాణాలతో, వరద నీటి ప్రవాహాన్ని తట్టుకునే విధంగా ఎత్తైన కొత్త బ్రిడ్జిని నిర్మించాల్సిన అవసరం ఉందని గ్రామస్థులు కోరుతున్నారు.

ప్రభుత్వం స్పందించాలని విజ్ఞప్తి

ఖాజా హైమత్‌పల్లి, నాగారం, అన్నారం తదితర గ్రామాల ప్రజలు తెలంగాణ ముఖ్యమంత్రి, కొడంగల్ నియోజకవర్గ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి తక్షణమే స్పందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రజల ప్రాణాలకు ప్రమాదం ఏర్పడకముందే సంబంధిత శాఖ అధికారులతో సమగ్ర పరిశీలన నిర్వహించి, శాశ్వత పరిష్కారంగా కొత్త బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరుతున్నారు.

వర్షాకాలం ప్రతి ఏడాది గ్రామ ప్రజలకు కష్టకాలంగా మారుతోందని, ఇకనైనా ప్రజల ఇబ్బందులను గుర్తించి వెంటనే చర్యలు చేపట్టాలని స్థానికులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. అభివృద్ధి పేరుతో కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్న తరుణంలో ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించే మౌలిక వసతులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని వారు కోరుతున్నారు.

గ్రామస్తుల డిమాండ్లు

  • ఖాజా హైమత్‌పల్లి వాగుపై ఎత్తైన నూతన బ్రిడ్జి నిర్మించాలి.
  • గతంలో చేపట్టిన నిర్మాణ పనులపై నాణ్యతా విచారణ నిర్వహించాలి.
  • ప్రజాధనం దుర్వినియోగం జరిగి ఉంటే బాధ్యులపై చర్యలు తీసుకోవాలి.
  • వర్షాకాలంలో ప్రత్యామ్నాయ రాకపోకల ఏర్పాట్లు చేయాలి.
  • గ్రామాలకు అత్యవసర సేవలు అంతరాయం లేకుండా శాశ్వత పరిష్కారం కల్పించాలి.

మరిన్ని తాజా వార్తల కోసం శ్రీ బల భీమ న్యూస్ ని Follow చేయండి

Youtube లో Sri bala bheema news అని సర్చ్ చేసి Subscribe చేయండి

తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలలో ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న మీ శ్రీ బలబీమ న్యూస్ ఛానల్ ను Like చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ Subscribe చేయండి .

ఈ లింకును ఓపెన్ చేసి మా మీ ఛానల్ ను  Subscribe చేయండి ధన్యవాదాలు.

www.youtube.com/@sribalabheema7188

🔥🔥 ప్రియమైన మిత్రులారా… 🔥🔥

మన శ్రీ బల భీమ యూట్యూబ్ ఛానల్ మీ కోసం నిత్యం తాజా వార్తలు, విశేషాలు అందిస్తోంది 📺

👉 ఇంకా సబ్‌స్క్రైబ్ చేయలేదా? ఇప్పుడే చేయండి!
🔔 బెల్ ఐకాన్‌పై క్లిక్ చేసి ప్రతి అప్డేట్‌ను వెంటనే తెలుసుకోండి

మీ ఒక సబ్‌స్క్రిప్షన్…
మన ఛానల్ ఎదుగుదలకు పెద్ద బలం 💪

📢 మీ మద్దతు – మన విజయానికి పునాది
👉 ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేయండి… ఇతరులతో కూడా షేర్ చేయండి!

🔥 కలిసి ఎదుగుదాం… శ్రీ బల భీమ న్యూస్ ను మరింత ముందుకు తీసుకెళ్లుదాం 🔥

www.youtube.com/@sribalabheema7188

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles