కలహండి జిల్లాలో ఆదివారం 11 మంది నక్సలైట్లు పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరిలో ఒక డివిజనల్ కమిటీ మెంబర్, నలుగురు ఏరియా కమిటీ మెంబర్లు, ఆరుగురు పార్టీ మెంబర్లు ఉన్నారు.
భువనేశ్వర్, మార్చి 15: ఒడిశాలోని కలహండి జిల్లాలో ఆదివారం 11 మంది నక్సలైట్లు పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరిలో ఒక డివిజనల్ కమిటీ మెంబర్, నలుగురు ఏరియా కమిటీ మెంబర్లు, ఆరుగురు పార్టీ మెంబర్లు ఉన్నారు. 1 AK-47, 4 SLRలు, 1 INSAS రైఫిల్, 1 12-బోర్ గన్, 2 సింగిల్ షాట్ ఆయుధాలను వీరు అధికారులకు అప్పగించారు. లొంగిపోయిన నక్సలైట్లలో చాలా మంది బస్తర్ ప్రాంతంలోని వివిధ జిల్లాలకు చెందిన వారిగా అధికారులు గుర్తించారు. ఈ 11 మంది నక్సలైట్లపై ప్రభుత్వం గతంలో 1 కోటి 34 లక్షల రూపాయల భారీ నగదు బహుమతిని (ఇనామ్) ప్రకటించింది.


