గుండ్లకుంటలో పాఠశాల నూతన భవన నిర్మాణానికి భూమిపూజ

  • రూ.90 లక్షలతో ఆధునిక పాఠశాల భవనం–
  • అదనంగా రూ.25 లక్షలతో ప్రహరీ గోడ నిర్మాణం
  • ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైన విద్య అందుబాటులోకి తీసుకువస్తున్నాం: కాంగ్రెస్ ఇన్‌చార్జ్ తిరుపతిరెడ్డి

శ్రీ బల భీమ న్యూస్ / కొడంగల్ , జూన్ 16:

వికార్‌బాద్ జిల్లా కొడంగల్ మున్సిపల్ పరిధిలోని నాలుగో వార్డు గుండ్లకుంట గ్రామంలో ప్రభుత్వ పాఠశాల నూతన భవన నిర్మాణానికి మంగళవారం ఘనంగా భూమిపూజ నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్ సమక్షంలో కొడంగల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ తిరుపతిరెడ్డి చేతుల మీదుగా భూమిపూజ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు మహేందర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథులు ప్రసంగించారు. ఈ సందర్భంగా తిరుపతిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందన్నారు. కార్పొరేట్ మరియు ప్రైవేట్ విద్యాసంస్థలకు ఏమాత్రం తీసిపోకుండా ప్రభుత్వ పాఠశాలలను ఆధునిక సౌకర్యాలతో మోడల్ స్కూళ్లుగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు.

గుండ్లకుంట ప్రభుత్వ పాఠశాలకు రూ.90 లక్షల వ్యయంతో ఆధునిక భవనాన్ని నిర్మించనున్నట్లు తెలిపారు. అదనంగా రూ.25 లక్షల నిధులతో పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ అభివృద్ధి పనులు పూర్తయిన తర్వాత విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించబడుతుందని అన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో ప్రస్తుతం విద్యార్థులకు అనేక సంక్షేమ, విద్యా సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు. ఉదయం అల్పాహారం, పాలు, మధ్యాహ్న భోజనం, ఉచిత పాఠ్యపుస్తకాలు, నోటుపుస్తకాలు, యూనిఫాంలు, డిజిటల్ తరగతులు, ఆధునిక బోధన పద్ధతులు, పరిశుభ్రమైన తరగతి గదులు, తాగునీటి సదుపాయం వంటి అనేక సౌకర్యాలు ప్రభుత్వం కల్పిస్తోందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతోందని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలలకు పంపకుండా ప్రభుత్వ బడుల్లోనే చేర్పించాలని విజ్ఞప్తి చేశారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్య, వైద్యం రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్నారని తిరుపతిరెడ్డి పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యాభివృద్ధి కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు ప్రజలు సహకరించాలని కోరారు.

 

మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రతి గ్రామంలో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా మౌలిక వసతులను మెరుగుపరుస్తున్నామని తెలిపారు. గుండ్లకుంట పాఠశాల అభివృద్ధి గ్రామ విద్యా రంగంలో ఒక మైలురాయిగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పట్నం అంబయ్య గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ శంకర్ నాయక్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేష్ రెడ్డి, కౌన్సిలర్ కడ వెంకటరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు నయూమ్, సంజీవరెడ్డి, ఆనంద్ రెడ్డి, మిఠాయి రాజు, మండల విద్యాధికారి రామ్ రెడ్డి, అంగన్‌వాడీ ఉపాధ్యాయులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని తాజా వార్తల కోసం శ్రీ బల భీమ న్యూస్ ని Follow చేయండి

Youtube లో Sri bala bheema news అని సర్చ్ చేసి Subscribe చేయండి

తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలలో ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న మీ శ్రీ బలబీమ న్యూస్ ఛానల్ ను Like చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ Subscribe చేయండి .

ఈ లింకును ఓపెన్ చేసి మా మీ ఛానల్ ను  Subscribe చేయండి ధన్యవాదాలు.

www.youtube.com/@sribalabheema7188

🔥🔥 ప్రియమైన మిత్రులారా… 🔥🔥

మన శ్రీ బల భీమ యూట్యూబ్ ఛానల్ మీ కోసం నిత్యం తాజా వార్తలు, విశేషాలు అందిస్తోంది 📺

👉 ఇంకా సబ్‌స్క్రైబ్ చేయలేదా? ఇప్పుడే చేయండి!
🔔 బెల్ ఐకాన్‌పై క్లిక్ చేసి ప్రతి అప్డేట్‌ను వెంటనే తెలుసుకోండి

మీ ఒక సబ్‌స్క్రిప్షన్…
మన ఛానల్ ఎదుగుదలకు పెద్ద బలం 💪

📢 మీ మద్దతు – మన విజయానికి పునాది
👉 ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేయండి… ఇతరులతో కూడా షేర్ చేయండి!

🔥 కలిసి ఎదుగుదాం… శ్రీ బల భీమ న్యూస్ ను మరింత ముందుకు తీసుకెళ్లుదాం 🔥

www.youtube.com/@sribalabheema7188

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles