మంత్రి పదవి కోసం రాహుల్ గాంధీని కలిసిన ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి

  • తెలంగాణ కేబినెట్‌లో అవకాశం కల్పించాలని వినతి
  • రంగారెడ్డి జిల్లాకు ప్రాతినిధ్యం కల్పించాలంటూ అభ్యర్థన

శ్రీ బల భీమ న్యూస్ / కొడంగల్ :


పరిగి ఎమ్మెల్యే టి. రామ్మోహన్ రెడ్డి ఢిల్లీలో లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర కేబినెట్‌లో తనకు మంత్రి పదవి కల్పించాలని కోరుతూ ప్రత్యేక వినతిపత్రాన్ని సమర్పించినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. రాహుల్ గాంధీ తన అభ్యర్థనపై సానుకూలంగా స్పందించినట్లు ఆయన తెలిపారు.

తెలంగాణ కేబినెట్‌లో ప్రస్తుతం మూడు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయని, ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాకు మంత్రి వర్గంలో సరైన ప్రాతినిధ్యం లేకపోవడం ఆందోళనకర విషయమని రామ్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. గత ప్రభుత్వాల కాలంలో రంగారెడ్డి జిల్లాకు మూడు నుంచి ఆరుగురు వరకు మంత్రులు ఉండేవారని గుర్తు చేశారు. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయ, పరిపాలనా దృష్ట్యా కీలకమైన రంగారెడ్డి జిల్లాకు కేబినెట్‌లో ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.

డీలిమిటేషన్ ప్రక్రియ అనంతరం రంగారెడ్డి జిల్లాలో అసెంబ్లీ నియోజకవర్గాలు 44కు, పార్లమెంట్ స్థానాలు 8కు పెరిగే అవకాశం ఉందని ఎమ్మెల్యే అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో జిల్లాకు బలమైన ప్రాతినిధ్యం కల్పించడం అవసరమని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో రంగారెడ్డి జిల్లా కీలక పాత్ర పోషిస్తోందని, ఆ దృష్ట్యా జిల్లా నాయకత్వానికి మంత్రి వర్గంలో స్థానం కల్పించాలని కోరారు.

తమ కుటుంబం మూడు తరాలుగా కాంగ్రెస్ పార్టీకి సేవలందిస్తోందని రామ్మోహన్ రెడ్డి తెలిపారు. పార్టీ బూత్ స్థాయి కార్యకర్తగా తన రాజకీయ ప్రయాణం ప్రారంభమైందని, ఎన్నో సంవత్సరాలుగా కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేస్తున్నానని చెప్పారు. నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి పార్టీ కోసం కష్టపడ్డానని, కాంగ్రెస్ అధికారంలోకి రావడమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి గ్రామస్థాయి నుంచి ప్రజల మధ్య పనిచేశానని ఎమ్మెల్యే వివరించారు. పార్టీ కష్టకాలంలో కూడా కాంగ్రెస్ జెండాను వదలకుండా ముందుకు సాగిన నాయకులకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన అభిప్రాయపడ్డారు. తన సేవలను గుర్తించి మంత్రి పదవి ఇవ్వాలని రాహుల్ గాంధీని కోరినట్లు చెప్పారు.

అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా తనకు మంత్రి పదవి వచ్చేలా అధిష్టానంతో చర్చించి సహకరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ తన సేవలను గుర్తించి తగిన గౌరవం ఇస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

రామ్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన, మంత్రి పదవి అంశంపై చేసిన వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్ వర్గాల్లో రాజకీయ చర్చకు దారితీశాయి. త్వరలో జరగనున్న కేబినెట్ విస్తరణపై రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

మరిన్ని తాజా వార్తల కోసం శ్రీ బల భీమ న్యూస్ ని Follow చేయండి

Youtube లో Sri bala bheema news అని సర్చ్ చేసి Subscribe చేయండి

తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలలో ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న మీ శ్రీ బలబీమ న్యూస్ ఛానల్ ను Like చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ Subscribe చేయండి .

ఈ లింకును ఓపెన్ చేసి మా మీ ఛానల్ ను  Subscribe చేయండి ధన్యవాదాలు.

www.youtube.com/@sribalabheema7188

🔥🔥 ప్రియమైన మిత్రులారా… 🔥🔥

మన శ్రీ బల భీమ యూట్యూబ్ ఛానల్ మీ కోసం నిత్యం తాజా వార్తలు, విశేషాలు అందిస్తోంది 📺

👉 ఇంకా సబ్‌స్క్రైబ్ చేయలేదా? ఇప్పుడే చేయండి!
🔔 బెల్ ఐకాన్‌పై క్లిక్ చేసి ప్రతి అప్డేట్‌ను వెంటనే తెలుసుకోండి

మీ ఒక సబ్‌స్క్రిప్షన్…
మన ఛానల్ ఎదుగుదలకు పెద్ద బలం 💪

📢 మీ మద్దతు – మన విజయానికి పునాది
👉 ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేయండి… ఇతరులతో కూడా షేర్ చేయండి!

🔥 కలిసి ఎదుగుదాం… శ్రీ బల భీమ న్యూస్ ను మరింత ముందుకు తీసుకెళ్లుదాం 🔥

www.youtube.com/@sribalabheema7188

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles