మాజీ ఐపీఎస్ డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ భద్రత ఉపసంహరణ సరైన విధానం కాదు

  • ఆయనకు బుల్లెట్ ప్రూఫ్ వాహనం, భద్రతా సిబ్బందిని యథాతథంగా కొనసాగించాలి
  •  అంబేద్కర్ జాతీయ అవార్డు గ్రహీత మంచనపల్లి శ్రీనివాస్ డిమాండ్

శ్రీ బల భీమ న్యూస్ / వికారాబాద్ , జూలై 5 :

మాజీ ఐపీఎస్ అధికారి, తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల పాఠశాలల మాజీ కార్యదర్శి డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్‌కు గత ప్రభుత్వం కల్పించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం మరియు భద్రతా సిబ్బందిని ఉపసంహరించుకోవడం సరైన విధానం కాదని అంబేద్కర్ విజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి, మాజీ స్వేరోస్ ఇంటర్నేషనల్ వికారాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి, అంబేద్కర్ జాతీయ అవార్డు గ్రహీత మంచనపల్లి శ్రీనివాస్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్‌కు కల్పించిన భద్రతను వెంటనే పునరుద్ధరించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

ఈ సందర్భంగా మంచనపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో దాదాపు 26 సంవత్సరాల పాటు పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించారని పేర్కొన్నారు. తన ఉద్యోగ జీవితంలో అనేక కీలకమైన, సున్నితమైన బాధ్యతలను నిర్వహించిన ఆయన, ముఖ్యంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సేవలందిస్తూ శాంతి భద్రతల పరిరక్షణలో కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు.

నేతలు, పోలీసులకు భద్రత కుదింపు | Telangana Reduces Security for Leaders and IPS Officers After Maoist Threat Decline

మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పనిచేసిన సమయంలో డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ అనేక సవాళ్లను ఎదుర్కొన్నారని, నక్సలైట్లను ప్రధాన జనజీవన స్రవంతిలోకి తీసుకురావడంలో ఆయన చేసిన కృషి ఎంతో ప్రశంసనీయమని తెలిపారు. అలాంటి పరిస్థితుల్లో పనిచేసిన అధికారికి ఇప్పటికీ ప్రాణహాని ఉండే అవకాశం ఉన్నందున, ఆయనకు భద్రత కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు.

దేశ అత్యున్నత సేవా పురస్కారాలలో ఒకటైన రాష్ట్రపతి శౌర్య పతకాన్ని అందుకున్న మాజీ ఐపీఎస్ అధికారికి గత ప్రభుత్వాలు భద్రత కల్పించాయని, అయితే ప్రస్తుతం ఆ భద్రతను తగ్గించడం వెనుక ఉన్న కారణాలను ప్రభుత్వం ప్రజలకు, ఉద్యోగులకు, మేధావులకు స్పష్టంగా తెలియజేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఒకవేళ ఈ తరహా చర్యలు కొనసాగితే భవిష్యత్తులో సమస్యాత్మక ప్రాంతాల్లో నిజాయితీగా, నిబద్ధతతో పనిచేయడానికి అధికారులు ముందుకు రావడానికి వెనుకాడే పరిస్థితులు ఏర్పడతాయని ఆందోళన వ్యక్తం చేశారు.

డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ ప్రస్తుతం రాజకీయ పార్టీలో బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ, ఒక పౌరుడిగా మరియు మాజీ ఉన్నతాధికారిగా ఆయనకు ఉన్న రాజ్యాంగబద్ధమైన హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలిపారు. గతంలో హైకోర్టు కూడా భద్రత విషయంలో కొన్ని మార్గదర్శకాలను సూచించిన నేపథ్యంలో, ఏకపక్షంగా భద్రతను తగ్గించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు.

Senior IPS officer RS Praveen Kumar takes premature retirement to work for social justice, ETGovernment

సామాజిక న్యాయం, విద్యా అభివృద్ధి కోసం డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ చేసిన సేవలు మరువలేనివని మంచనపల్లి శ్రీనివాస్ అన్నారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన వేలాది మంది విద్యార్థులను ఉన్నత విద్యావకాశాల వైపు నడిపించారని, విదేశీ విశ్వవిద్యాలయాల్లో చదివే అవకాశాలను కల్పించారని చెప్పారు. అలాగే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించే స్థాయికి పేద, వెనుకబడిన వర్గాల విద్యార్థులను ప్రోత్సహించడం ఆయన దూరదృష్టికి నిదర్శనమని కొనియాడారు.

స్వేరోస్ అనే పూర్వ విద్యార్థుల వేదికను ఏర్పాటు చేసి, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ భావజాలాన్ని యువతకు, విద్యార్థులకు పరిచయం చేయడంలో డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ కీలక పాత్ర పోషించారని తెలిపారు. అంతేకాకుండా “పే బ్యాక్ టు సొసైటీ” సిద్ధాంతం ద్వారా అనేక మంది విద్యార్థులకు ఆర్థిక సహాయం, మార్గదర్శకత్వం అందించడంలో ఆయన చేసిన సేవలు సమాజానికి ఆదర్శంగా నిలిచాయని పేర్కొన్నారు.

ఇదే సమయంలో డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ సతీమణి లక్ష్మీ బాయి గారిని వ్యవసాయ మార్కెటింగ్ డైరెక్టర్ పదవి నుంచి సహకార శాఖకు బదిలీ చేయడంపై కూడా అనుమానాలు వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల్లో బదిలీలు సాధారణ ప్రక్రియ అయినప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో ఈ బదిలీపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు.

గతంలో కూడా దళిత, బీసీ, ఎస్టీ వర్గాలకు చెందిన పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల విషయంలో ఇలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయని, నేడు డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ విషయంలో కూడా అదే తరహా పరిస్థితులు కనిపిస్తున్నాయని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా, ప్రజాస్వామ్య విలువలకు అనుగుణంగా వ్యవహరించాలని కోరారు.

డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ లేదా ఆయన కుటుంబ సభ్యులకు ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే దానికి రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని మంచనపల్లి శ్రీనివాస్ హెచ్చరించారు. వెంటనే ఆయనకు బుల్లెట్ ప్రూఫ్ వాహనం, భద్రతా సిబ్బందిని యథాతథంగా కొనసాగించాలని డిమాండ్ చేశారు.

లేనిపక్షంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గిరిజనులు, మైనార్టీలు, స్వేరోస్ సభ్యులు, బహుజన సంఘాలు, ప్రజాసంఘాలు, ప్రజాస్వామ్య శక్తులతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని మంచనపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు.


యం. రవీందర్
సీనియర్ జర్నలిస్టు
మొబైల్: 7901503777


మరిన్ని తాజా వార్తల కోసం శ్రీ బల భీమ న్యూస్ ని Follow చేయండి

Youtube లో Sri bala bheema news అని సర్చ్ చేసి Subscribe చేయండి

తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలలో ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న మీ శ్రీ బలబీమ న్యూస్ ఛానల్ ను Like చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ Subscribe చేయండి .

ఈ లింకును ఓపెన్ చేసి మా మీ ఛానల్ ను  Subscribe చేయండి ధన్యవాదాలు.

www.youtube.com/@sribalabheema7188

🔥🔥 ప్రియమైన మిత్రులారా… 🔥🔥

మన శ్రీ బల భీమ యూట్యూబ్ ఛానల్ మీ కోసం నిత్యం తాజా వార్తలు, విశేషాలు అందిస్తోంది 📺

👉 ఇంకా సబ్‌స్క్రైబ్ చేయలేదా? ఇప్పుడే చేయండి!
🔔 బెల్ ఐకాన్‌పై క్లిక్ చేసి ప్రతి అప్డేట్‌ను వెంటనే తెలుసుకోండి

మీ ఒక సబ్‌స్క్రిప్షన్…
మన ఛానల్ ఎదుగుదలకు పెద్ద బలం 💪

📢 మీ మద్దతు – మన విజయానికి పునాది
👉 ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేయండి… ఇతరులతో కూడా షేర్ చేయండి!

🔥 కలిసి ఎదుగుదాం… శ్రీ బల భీమ న్యూస్ ను మరింత ముందుకు తీసుకెళ్లుదాం 🔥

www.youtube.com/@sribalabheema7188

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles