రైతన్నకు పోలీసు భరోసా..!

  • మా మద్దతు మీకే” అంటూ అండగా నిలిచిన పోలీస్ బాసులు
  • కొనుగోలు కేంద్రాలను సందర్శిస్తూ రైతుల సమస్యలపై ఆరా
  • గన్ని బ్యాగులు, కాంటాలు, లారీల కొరతపై రైతుల ఆవేదన
  • కలెక్టర్లతో సమన్వయం చేసి సమస్యలు పరిష్కరిస్తామని హామీ

శ్రీ బల భీమ న్యూస్ / కొడంగల్ :
నిత్యం నేరాల దర్యాప్తులు, శాంతిభద్రతల పరిరక్షణలో బిజీగా ఉండే పోలీస్ అధికారులు ఇప్పుడు రైతుల కష్టాలను తెలుసుకునేందుకు కల్లాల బాట పట్టారు. మండుతున్న ఎండల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రోజుల తరబడి నిరీక్షిస్తున్న రైతుల ఇబ్బందులను ప్రత్యక్షంగా పరిశీలిస్తూ వారికి భరోసా కల్పిస్తున్నారు. “రైతన్నకు ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు.. మీ సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం” అంటూ పోలీస్ అధికారులు రైతులకు ధైర్యం చెబుతున్నారు.

వికారాబాద్ జిల్లాలోని కొడంగల్ నియోజకవర్గ పరిధిలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను కొడంగల్ సీఐ శ్రీధర్ రెడ్డి తన సిబ్బందితో కలిసి సందర్శించి రైతులతో ముఖాముఖి మాట్లాడారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. పోలీస్ అధికారులు నేరుగా కేంద్రాలకు రావడంతో రైతుల్లో కొంత ధైర్యం నెలకొంది.

ఎండలోనే ధాన్యం కాపలా కాస్తున్న రైతులు

కొడంగల్ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో రైతులు వారాల తరబడి ధాన్యం రాశులను కొనుగోలు కేంద్రాల వద్ద ఉంచుకుని తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎండ తీవ్రత పెరుగుతున్నా కనీస సదుపాయాలు లేక రైతులు, మహిళలు, వృద్ధులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

కొన్ని కేంద్రాల్లో టెంట్లు లేకపోవడంతో రైతులు చెట్ల నీడలోనే వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాగునీటి సదుపాయం కూడా లేకపోవడంతో రైతులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. “ప్రభుత్వం కొనుగోళ్లు సాఫీగా జరుగుతున్నాయని చెబుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది” అంటూ రైతులు పోలీస్ అధికారుల ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు.

టోకెన్లు ఇచ్చినా కాంటాలు లేవు

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ప్రధాన సమస్యగా కాంటాల కొరత నిలుస్తోందని రైతులు చెబుతున్నారు. టోకెన్లు ఇచ్చిన తర్వాత కూడా రోజులు గడుస్తున్నా కాంటాలు వేయడం లేదని రైతులు వాపోతున్నారు. కొన్నిచోట్ల టోకెన్ కోసం రోజుల తరబడి ఎదురుచూడాల్సి వస్తోందని చెబుతున్నారు.

“టోకెన్ ఇస్తారు.. కానీ కాంటా వేయరు. కాంటా వేసినా బస్తాలను తరలించరు. ఇలా రోజులు గడుస్తున్నాయి” అంటూ రైతులు పోలీస్ అధికారులకు తమ బాధను వివరించారు. వర్షాలు వస్తే ధాన్యం తడిసి నష్టపోయే పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

లారీల కొరతతో నిలిచిపోయిన ధాన్యం తరలింపు

కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు వేసిన ధాన్యం బస్తాలు కూడా రోజుల తరబడి అక్కడే పేరుకుపోతున్నాయి. ప్రధానంగా లారీల కొరత కారణంగా ధాన్యం మిల్లులకు తరలించడంలో తీవ్ర జాప్యం జరుగుతోందని రైతులు చెబుతున్నారు.

“కాంటాలు వేసి బస్తాలు కట్టినా అవి అక్కడే ఉంటున్నాయి. లారీలు రావడం లేదు. దీంతో కొత్తగా వచ్చిన ధాన్యాన్ని నిల్వ చేసేందుకు కూడా స్థలం లేక ఇబ్బందులు పడుతున్నాం” అంటూ రైతులు పోలీస్ అధికారులకు తెలిపారు.

కొడంగల్ నియోజకవర్గంతో పాటు వికారాబాద్ జిల్లాలో వందలాది లారీలు ఇసుక రవాణాకు వెళ్లుతున్నాయని, కనీసం ఒకరోజైనా ఆ లారీలను ధాన్యం తరలింపుకు వినియోగించాలని రైతులు కోరారు. లారీ అసోసియేషన్‌తో మాట్లాడి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

రైతులతో నేరుగా మాట్లాడిన సీఐ శ్రీధర్ రెడ్డి

కొడంగల్ సీఐ శ్రీధర్ రెడ్డి కొనుగోలు కేంద్రాలను సందర్శిస్తూ రైతులతో నేరుగా మాట్లాడడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. “మీ సమస్యలు ఏమిటో చెప్పండి.. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం” అంటూ రైతులకు ధైర్యం చెప్పారు.

పోలీస్ అధికారులు కొనుగోలు కేంద్రాల్లోని పరిస్థితులను స్వయంగా పరిశీలించారు. ధాన్యం రాశులు, కాంటాలు, గన్ని బ్యాగుల కొరత, నిల్వ సమస్యలు, లారీ సమస్యలు వంటి అంశాలను గమనించి సంబంధిత అధికారులతో మాట్లాడతామని తెలిపారు.

గన్ని బ్యాగుల కొరతపై ఆవేదన

ధాన్యం నిల్వకు అవసరమైన గన్ని బ్యాగులు సమయానికి అందడం లేదని రైతులు వాపోతున్నారు. గన్ని సంచులు లేక ధాన్యం బస్తాలు కట్టలేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. కొన్నిచోట్ల రైతులే అదనపు ఖర్చుతో సంచులు కొనుగోలు చేస్తున్న పరిస్థితి ఉందని తెలిపారు.

“పంట పండించడానికి కష్టపడ్డాం.. ఇప్పుడు కొనుగోలు కేంద్రాల వద్ద ఇబ్బందులు పడుతున్నాం” అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

అధికారుల మాటలు – క్షేత్రస్థాయి వాస్తవాలు భిన్నం

జిల్లా స్థాయి అధికారులు వీడియో కాన్ఫరెన్స్‌లు, టెలికాన్ఫరెన్స్‌లలో కొనుగోళ్లు సజావుగా జరుగుతున్నాయని చెబుతున్నప్పటికీ, వాస్తవ పరిస్థితులు మాత్రం పూర్తిగా భిన్నంగా ఉన్నాయని రైతులు ఆరోపిస్తున్నారు.

కొనుగోలు కేంద్రాల్లో వారాల తరబడి ధాన్యం పేరుకుపోయినా స్పందన లేకపోవడం రైతుల్లో ఆగ్రహాన్ని పెంచుతోంది. కొందరు రైతులు అప్పులు చేసి పంట పండించగా ఇప్పుడు ధాన్యం అమ్మకాలు ఆలస్యం కావడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు.

మరిన్ని తాజా వార్తల కోసం శ్రీ బల భీమ న్యూస్ ని Follow చేయండి

Youtube లో Sri bala bheema news అని సర్చ్ చేసి Subscribe చేయండి

తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలలో ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న మీ శ్రీ బలబీమ న్యూస్ ఛానల్ ను Like చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ Subscribe చేయండి .

ఈ లింకును ఓపెన్ చేసి మా మీ ఛానల్ ను  Subscribe చేయండి ధన్యవాదాలు.

www.youtube.com/@sribalabheema7188

🔥🔥 ప్రియమైన మిత్రులారా… 🔥🔥

మన శ్రీ బల భీమ యూట్యూబ్ ఛానల్ మీ కోసం నిత్యం తాజా వార్తలు, విశేషాలు అందిస్తోంది 📺

👉 ఇంకా సబ్‌స్క్రైబ్ చేయలేదా? ఇప్పుడే చేయండి!
🔔 బెల్ ఐకాన్‌పై క్లిక్ చేసి ప్రతి అప్డేట్‌ను వెంటనే తెలుసుకోండి

మీ ఒక సబ్‌స్క్రిప్షన్…
మన ఛానల్ ఎదుగుదలకు పెద్ద బలం 💪

📢 మీ మద్దతు – మన విజయానికి పునాది
👉 ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేయండి… ఇతరులతో కూడా షేర్ చేయండి!

🔥 కలిసి ఎదుగుదాం… శ్రీ బల భీమ న్యూస్ ను మరింత ముందుకు తీసుకెళ్లుదాం 🔥

www.youtube.com/@sribalabheema7188

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles