- లారీలు లేక రైతన్నల అవస్థలు..
- మండుటెండలో తూకం కోసం నిరీక్షణ
శ్రీ బల భీమ న్యూస్ / కొడంగల్ :
దౌల్తాబాద్ మండల కేంద్రంలోని వరి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలు పేరుకుపోయి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సరైన సమయానికి లారీలు అందుబాటులో లేకపోవడంతో ఎక్కడికక్కడ వరి ధాన్యం నిలిచిపోయింది. ఇప్పటికే కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకొచ్చిన రైతులు రోజుల తరబడి తూకం కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది.
మూడు రోజుల క్రితమే పరిస్థితిపై స్పందించిన దీపక్ తివారి అధికార యంత్రాంగానికి తగిన సూచనలు చేసినప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితిలో మార్పు కనిపించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లారీలు సరిపడా రాకపోవడంతో ధాన్యం తరలింపు పూర్తిగా నెమ్మదించిందని చెబుతున్నారు.
మండుటెండలో ధాన్యపు బస్తాల వద్దే రైతులు గడపాల్సి వస్తోంది. పగటిపూట ఎండలకు ఎండుతూ, వర్షం పడితే ధాన్యం తడుస్తూ నష్టపోతామనే భయంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తక్షణమే అదనపు లారీలు ఏర్పాటు చేసి కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని రైతన్నలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని దౌల్తాబాద్ మండలంలోని పలు గ్రామాల రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.
|
మరిన్ని తాజా వార్తల కోసం శ్రీ బల భీమ న్యూస్ ని Follow చేయండి Youtube లో Sri bala bheema news అని సర్చ్ చేసి Subscribe చేయండి |
తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలలో ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న మీ శ్రీ బలబీమ న్యూస్ ఛానల్ ను Like చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ Subscribe చేయండి .
ఈ లింకును ఓపెన్ చేసి మా మీ ఛానల్ ను Subscribe చేయండి ధన్యవాదాలు.
www.youtube.com/@sribalabheema7188

ప్రియమైన మిత్రులారా…
మన శ్రీ బల భీమ యూట్యూబ్ ఛానల్ మీ కోసం నిత్యం తాజా వార్తలు, విశేషాలు అందిస్తోంది
ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా? ఇప్పుడే చేయండి!
బెల్ ఐకాన్పై క్లిక్ చేసి ప్రతి అప్డేట్ను వెంటనే తెలుసుకోండి
మీ ఒక సబ్స్క్రిప్షన్…
మన ఛానల్ ఎదుగుదలకు పెద్ద బలం
మీ మద్దతు – మన విజయానికి పునాది
ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి… ఇతరులతో కూడా షేర్ చేయండి!
కలిసి ఎదుగుదాం… శ్రీ బల భీమ న్యూస్ ను మరింత ముందుకు తీసుకెళ్లుదాం
www.youtube.com/@sribalabheema7188



