కొడంగల్‌లో అక్రమ ఇసుక డంపుల దందా జోరు

  • రాజకీయ, అధికారుల అండదండలతో కోట్ల వ్యాపారం?
  • పట్టించుకోని యంత్రాంగంపై ప్రజల ఆగ్రహం

శ్రీ బల భీమ న్యూస్ / కొడంగల్ , ప్రతినిధి:

వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో అక్రమ ఇసుక వ్యాపారం రోజురోజుకు విస్తరిస్తోందని స్థానిక ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ నాయకులు, కొంతమంది అధికారుల అండదండలతో ఈ అక్రమ దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కోట్ల రూపాయల వ్యాపారం బహిరంగంగానే సాగుతున్నప్పటికీ సంబంధిత శాఖలు పట్టించుకోవడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు.

కొడంగల్ పట్టణ పరిధిలో అనేక ప్రాంతాల్లో అక్రమ ఇసుక డంపులు వెలసినట్లు స్థానికులు చెబుతున్నారు. ముఖ్యంగా బొంరాస్‌పేట మండలంలోని పలు గ్రామాల నుంచి అర్ధరాత్రి వేళల్లో ట్రాక్టర్లు, ఇతర వాహనాల ద్వారా ఇసుకను తరలించి కొడంగల్ పట్టణంలో డంపింగ్ చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. అనంతరం ఆ ఇసుకను అధికారికంగా తీసుకొచ్చినదిగా చూపిస్తూ వివిధ సాకులు చెబుతూ వ్యాపారం నిర్వహిస్తున్నారని ప్రజలు పేర్కొంటున్నారు.

స్థానికుల కథనం ప్రకారం, రాత్రివేళల్లో గ్రామాల నుంచి తరలించిన ఇసుకను పట్టణంలోని ఖాళీ స్థలాలు, రోడ్ల పక్కన ఉన్న ప్రదేశాల్లో నిల్వ చేసి, ఉదయం నుంచి విక్రయాలు ప్రారంభిస్తున్నారు. ఈ సందర్భంగా “కాలేశ్వరం నుంచి వచ్చింది”, “అధికారిక అనుమతులతో తెచ్చాం” వంటి కారణాలు చూపిస్తూ కొనుగోలుదారులను నమ్మిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇదే సమయంలో సంబంధిత అధికారులకు మామూళ్లు చెల్లిస్తూ తమ వ్యాపారాన్ని నిరాటంకంగా కొనసాగిస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.

జాగా చూసి డంపింగ్… ఆపై వ్యాపారం!

పట్టణంలో ఎక్కడ ఖాళీ స్థలం కనిపించినా అక్కడే ఇసుక డంపింగ్ చేసి వ్యాపారం నిర్వహిస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు వ్యాపారులు రాజకీయ నాయకుల సహకారం, అధికారుల మద్దతును అండగా చేసుకుని బహిరంగంగానే తమ వ్యాపార కేంద్రాలను ఏర్పాటు చేసుకున్నారని చెబుతున్నారు. “మా దగ్గర అన్ని రకాల బిల్డింగ్ మెటీరియల్స్ అమ్మబడును” అంటూ ప్రచార బోర్డులు ఏర్పాటు చేసి అక్రమ ఇసుక విక్రయాలను కొనసాగిస్తున్నారని ఆరోపిస్తున్నారు.

ఈ డంపుల వద్ద కేవలం ఇసుక మాత్రమే కాకుండా ఇతర నిర్మాణ సామగ్రి కూడా విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే వీటికి అవసరమైన అనుమతులు ఉన్నాయా లేదా అనే విషయంపై స్పష్టత లేకపోవడం ప్రజల్లో అనుమానాలకు తావిస్తోంది.

ఇసుక ధరల పేరుతో భారీ దోపిడీ?

బొంరాస్‌పేట మండలం నుంచి అక్రమంగా తరలిస్తున్న ఇసుకను ఒక టన్నుకు సుమారు రూ.20,700 వరకు విక్రయిస్తున్నట్లు సమాచారం. దీనికి అదనంగా ట్రాక్టర్ రవాణా ఖర్చు పేరుతో మరో రూ.3,000 వరకు వసూలు చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. లేబర్ ఛార్జీలు, లోడింగ్, అన్‌లోడింగ్ పేర్లతో మరిన్ని చార్జీలు వసూలు చేస్తూ వినియోగదారులను దోచుకుంటున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఇసుక కొరతను అవకాశంగా మార్చుకుని కొందరు వ్యాపారులు అధిక ధరలకు విక్రయాలు చేస్తుండటంతో సాధారణ ప్రజలు, చిన్న కాంట్రాక్టర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలుస్తోంది. ఇళ్ల నిర్మాణం చేపట్టే మధ్యతరగతి కుటుంబాలపై ఈ భారం మరింత పెరుగుతోందని స్థానికులు చెబుతున్నారు.

అనుమతులు లేకుండా కోట్ల వ్యాపారం ఎలా?

ప్రజలు లేవనెత్తుతున్న ప్రధాన ప్రశ్న ఇదే. ఈ డంపులకు మైనింగ్ శాఖ అనుమతులు లేవని, రెవెన్యూ శాఖ నుంచి ఎలాంటి అనుమతులు లేవని, పోలీసు శాఖ అనుమతులు కూడా లేవని ఆరోపణలు ఉన్నాయి. అలాగే మున్సిపాలిటీ పరిధిలో వ్యాపారం నిర్వహించేందుకు అవసరమైన అనుమతులు కూడా లేవని స్థానికులు చెబుతున్నారు.

అన్ని శాఖల అనుమతులు లేకుండా కోట్ల రూపాయల వ్యాపారం ఎలా సాగుతోందనే ప్రశ్న ఇప్పుడు ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యాపారాల వెనుక ఎవరి అండదండలు ఉన్నాయి? ఎవరు అనుమతిస్తున్నారు? సంబంధిత అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? అనే ప్రశ్నలు ప్రజల నుంచి వెల్లువెత్తుతున్నాయి.

ప్రజల నుంచి విచారణ డిమాండ్

కొడంగల్ పట్టణంలో అక్రమ ఇసుక డంపులపై సమగ్ర విచారణ జరపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మైనింగ్, రెవెన్యూ, పోలీసు, మున్సిపల్ శాఖలు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించి అక్రమ నిల్వలను గుర్తించాలని కోరుతున్నారు. అక్రమంగా ఇసుక నిల్వ చేసి విక్రయిస్తున్న వారిపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

అలాగే ప్రభుత్వ భూములు, రోడ్ల పక్కన ఉన్న స్థలాలు లేదా అనుమతులు లేని ప్రదేశాల్లో ఇసుక డంపింగ్ చేసిన వారిపై వాల్టా చట్టం, మైనింగ్ చట్టాలు, సంబంధిత నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

చర్యలు తీసుకుంటారా? లేక చూస్తూ ఊరుకుంటారా?

కొడంగల్ పట్టణంలో జరుగుతున్న ఈ అక్రమ ఇసుక దందాపై సంబంధిత శాఖలు ఇప్పటికైనా స్పందిస్తాయా? అక్రమంగా వ్యాపారం చేస్తున్న వారిపై కేసులు నమోదు చేసి చట్టాన్ని అమలు చేస్తాయా? లేక కోట్ల రూపాయల ఈ వ్యాపారాన్ని అలాగే కొనసాగనిస్తాయా? అనే ప్రశ్నలు ప్రజలలో ఉత్కంఠ రేపుతున్నాయి.

ప్రజల నుంచి వస్తున్న ఆరోపణల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం, మైనింగ్ శాఖ, రెవెన్యూ అధికారులు, పోలీసు శాఖ వెంటనే స్పందించి వాస్తవ పరిస్థితులపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కొడంగల్‌లో అక్రమ ఇసుక వ్యాపారానికి చెక్ పెట్టే దిశగా అధికారులు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది.

మరిన్ని తాజా వార్తల కోసం శ్రీ బల భీమ న్యూస్ ని Follow చేయండి

Youtube లో Sri bala bheema news అని సర్చ్ చేసి Subscribe చేయండి

తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలలో ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న మీ శ్రీ బలబీమ న్యూస్ ఛానల్ ను Like చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ Subscribe చేయండి .

ఈ లింకును ఓపెన్ చేసి మా మీ ఛానల్ ను  Subscribe చేయండి ధన్యవాదాలు.

www.youtube.com/@sribalabheema7188

🔥🔥 ప్రియమైన మిత్రులారా… 🔥🔥

మన శ్రీ బల భీమ యూట్యూబ్ ఛానల్ మీ కోసం నిత్యం తాజా వార్తలు, విశేషాలు అందిస్తోంది 📺

👉 ఇంకా సబ్‌స్క్రైబ్ చేయలేదా? ఇప్పుడే చేయండి!
🔔 బెల్ ఐకాన్‌పై క్లిక్ చేసి ప్రతి అప్డేట్‌ను వెంటనే తెలుసుకోండి

మీ ఒక సబ్‌స్క్రిప్షన్…
మన ఛానల్ ఎదుగుదలకు పెద్ద బలం 💪

📢 మీ మద్దతు – మన విజయానికి పునాది
👉 ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేయండి… ఇతరులతో కూడా షేర్ చేయండి!

🔥 కలిసి ఎదుగుదాం… శ్రీ బల భీమ న్యూస్ ను మరింత ముందుకు తీసుకెళ్లుదాం 🔥

www.youtube.com/@sribalabheema7188

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles